తెలంగాణ
రేపు సనత్ నగర్ గ్రామదేవత పోచమ్మ తల్లికి జాతర మహోత్సవం

ఆషాడంలో జరిగే బోనాల కార్యక్రమంలో భాగంగా అన్ని దేవాలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు అలాగే నేడు సనత్ నగర్ గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు జాతర మహోత్సవం జరగనుంది అని ఈవో శ్రీనివాసరాజు తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతర మహోత్సవ కార్యక్రమం లో భాగంగా రేపు ఉదయం 6 గంటలకు పాలాభిషేకం ఉదయం 7 గంటలకు పుష్పాలంకరణ మధ్యాహ్నం 11 గంటలకు పాలాభిషేకం రాత్రి 7 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం బలిహరణ జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులు పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వస్తు ధన రూపేనా తమ విరాళాలను ఆలయ అభివృద్ధికి ఇచ్చి తోడ్పడతారని ఈవో శ్రీనివాసరాజు తెలిపారు



