
తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరుమీదున్నా, సిరిసిల్లలో కేటీఆర్ ఖంగుతినేలా ఫలితాలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహనికి గురయ్యారు. దీంతో ప్రతిష్ట్రాత్మకంగా తీసుకున్నా చోటే ఎదురు దెబ్బ తగలడంతో సిరిసిల్ల నాయకులు అయోమయ పరిస్థితిలో పడిపోయారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాలో స్వతంత్ర అభ్యర్థులు భారీగా పోటీ ఇచ్చారు. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి కేటీఆర్కు విజయనందం ఇవ్వలేదు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్ఎస్కు చెందిన రెబల్స్గా తెలుస్తొంది.


