Allఆంధ్రప్రదేశ్
పరిమళ్ నత్వానికి ఏపీ కోటాలో రాజ్యసభ సీటు..?

అంతా అనుకున్నట్టే ఏపి నుంచి నాలుగో సీటు కోసం ముఖేష్ అంబానీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆతని సన్నిహితుడు , ప్రముఖ వ్యాపార వేత్త, పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు కేటాయించాలని జగన్నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం లేదా మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైఎస్సార్సీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే నలుగురు అభ్యర్థులలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలు ఉన్నారని సమాచారం.





