
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలోనిన్న సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.



