All

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ……. సీఎం కేసీఆర్‌

భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని
 కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌
కు పోటీగా సీఎం కేసీఆర్‌ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన
 ఆగస్టు 15కు ముందు ఏడు రోజులు.. తర్వాత ఏడు రోజులు.. మొత్తం 15 రోజుల పాటు తెలంగాణ
వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు నిర్వహించనున్నట్టు శనివారం
 ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కేసీఆర్‌
 పిలుపునిచ్చారు. ఇందుకోసం 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి గద్వాల, నారాయణ పేట్‌
, సిరిసిల్ల, పోచంపెల్లి, భువనగిరి, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్‌ లూమ్‌ కార్మికులకు
 ఆర్డర్లివ్వాలని అధికారులను ఆదేశించారు. జెండాల తయారీ సహా ప్రచార కార్యక్రమాల కోసం ఎంత
 ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో
భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
 ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఆగస్టు 13-15 తేదీల మధ్యలో భారత ప్రజలంతా తమ ఇండ్లపై
 త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ శుక్రవారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.
 మరుసటి రోజే.. అదే తరహా కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ వజ్రోత్సవాల పేరుతో సొంతంగా
 అమలు చేయ సంకల్పించడం గమనార్హం. 15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలుభారత
 స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలకు సంబంధించి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో
సమావేశం నిర్వహించారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా
 రూపొందించుకోవాల్సి ఉంది. నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్య విలువలను
 కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. సాంకేతికత, పని ఒత్తిడితో
 ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన
 అవసరం తెలంగాణ బిడ్డలకుంది. పల్లె.. పట్నం.. ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాలి’ అని కేసీఆర్‌
 అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి అర్థమయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని
అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా ఆటలపోటీలు, వ్యాసరచన, సాంస్కృతిక
 కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలుపంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ శాఖల సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా
 స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలగాలని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అన్నారు. అన్ని
 ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు,
 ప్రభుత్వ అధికారులు తమ లెటర్‌ హెడ్స్‌పై జాతీయ జెండా చిహ్నాన్ని ముద్రించుకోవాలని సూచించారు. పదిహేను
 రోజుల పాటు పత్రికల మాస్టర్‌ హెడ్స్‌ మీద జాతీయ పతాకాన్ని ముద్రించాలని, టీవీ చానళ్లలో 15 రోజుల పాటు త్రివర్ణ
 పతాకం కనిపించేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని మీడియా యాజమాన్యాలకు సీఎం విజ్ఞప్తి చేశారు
ఫ్రీడమ్‌ రన్‌లను నిర్వహించండిప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ జండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని,
అందుకు అనుగుణంగా జెండాలను రూపొందించాలని కేసీఆర్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker