ఆంధ్రప్రదేశ్
అప్పులపై జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది.
టాక్స్లు,సెస్లను తనాఖాపెట్టి తెచ్చే అప్పులను కూడా.. రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే
పరిగణిస్తామని లోక్సభలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. రాష్ట్రం
అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు
ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు. అది కూడా… రాష్ట్రాల
ఆర్థిక వనరులు, తిరిగి చెల్లించగల స్తోమత ఆధారంగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ..
. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం
సరిపోవడంలేదు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి కూడా సరిపోవడం లేదు. అందుకే..
. కేంద్రానికి తెలియకుండా దొంగదారిలో అప్పులు తేవడంపై రాష్ట్రం దృష్టి సారించింది.
ఈ విషయంలో ఏకంగా పీహెచ్డీ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్
(ఏపీఎస్డీసీ) అనే ఒక తప్పుడు మోడల్ను సృష్టించింది. కనీసం పైసా కూడా ఆదాయం
లేని ఒక కార్పొరేషన్ను పేపర్లపై పుట్టించి… మద్యంపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్
పన్నును ఆ కార్పొరేషన్కు మళ్లించారు. దానినే కార్పొరేషన్ ఆదాయంగా చూపి
ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతి పైసా అప్పును ప్రభుత్వం నిలదీస్తామని
హెచ్చరించారు రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చారు.




