
సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా ప్రతిరోజూ పండగే’ రూపొందించిన డైరెక్టర్ మారుతి సినిమా కిక్కు తగ్గకముందే వరుస అవకాశాలు వచ్చి పడుతుండటంతో తబ్బిబ్బవుతున్నాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, డీవీవీ దానయ్య.. ఇలా పలువురు మారుతితో సినిమా చేసేందుకు రడీ అవుతున్నారని సమాచారం. కాగా ఇది ఓకే అయితే వచ్చే ఏప్రిల్లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే మారుతి.. రవితేజకు ఎలాంటి కథను వినిపించనున్నారనే వార్త టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది
‘డిస్కోరాజా’ , క్రాక్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న రవితేజ వీటి తదుపరి సినిమా మారుతితో చేసే ఆస్కారం ఉందని ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది.
మారుతీకి మాస్ మహరాజ్ గ్రీన్సిగ్నల్




