
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ హేతువాది – నాస్తికుడు – ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూ ద్రవిడార్ విదుతలై ఖజగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా రజనీపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని – ఐపీసీ సెక్షన్స్ 153ఏ -505 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. రజనీ వ్యాఖ్యలపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.




