
అందాల నెరజాన నాభ నటేష్ అడప దడప సినిమాలు చేసిన సరైన గుర్తింపు రాలేదు. పలువురు నటులు పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఆయన సినిమాలు నటులకు ఓరేంజ్లో స్టార్డమ్ను తీసుకొస్తాయి. అయితే పూరీజగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాతో నాభ నటేష్ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చారు. దీంతో ఆమెను అవకాశలు వెతుకుంటు వస్తున్నాయి. దీంతో ఆమె పారితోషికారన్ని కూడా తనకు ఇష్టం వచ్చినంతా డిమాండ్ చేస్తోంది.
ఆ సినిమా హిట్తో ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ 40 లక్షలు చేసింది. ఇక ఇప్పుడు రవితేజతో డిస్కో రాజా సినిమా చేస్తుండటంతో పాటు ఆమెకు ఆఫర్స్ వరిస్తుడడంతో తన రెమ్యూనరేషన్ ఏకంగా 80 లక్షలు పెంచి నిర్మాతలకు గుబులు పుట్టిస్తోంది. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సినిమా హిట్ అవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని వారు మధనపడుతున్నారు. అయితే నభా తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాతలు నభా అడిగినంత అప్పజెప్పడంతో సినిమాకు కాల్షీట్లు కేటాయించింది.




