
హీరో శర్వానంద్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ‘శ్రీకారం’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసింది ఆచిత్ర యూనిట్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్లుగా నటిస్తోంది. ‘శ్రీకారం’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ చూస్తే, ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగె సినిమా గా కనిపిస్తోంది. ట్రాక్టర్ నడుపుతూ, స్నేహితులతో సరదాగా గడుపే పల్లెటూరి యువకుడిగా హీరో శర్వా కనిపిస్తారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ నెల 24 వ తేదీన రిలీజ్ కానున్నట్టు యూనిట్ ప్రకటించింది ఇప్పటికే .



