తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగులంతా బినామీలే…

వెస్ట్ మర్రేడ్పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు కేసు పోలీసుల విచారణ దాకా వెళ్ళింది పోలీసు విచారణ అంటే దాదాపు ఆ కేసు
ఒక దరికి చేరినట్టే పోలీసులు తప్పుచేసి దొరికితే మరో పోలీసు ఎంక్వైరీ చేసి శిక్ష ఖరారు చేస్తారా అది
జరుగుతుందా నిజానికి బాధితులు ఎన్కౌంటర్ చేయమని అడిగితే తప్పు ఎందుకంటే అతను పోలీస్
కాబట్టి తప్పు చేశాడు కాబట్టి దొంగ దొరికాడు దొరకని దొంగలు అన్నిట్లోనూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్లంతా వ్యాపారాలు చేసే వారికి బినామీలే, రియల్
ఎస్టేట్ వ్యాపారాలు నడవాలన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరగాలన్న రాజకీయ నాయకులు
పోలీసులను ముఖ్యంగా వాడుకుంటారు వారు చేసే తప్పిదాలను ముందుగానే పోలీసులకు చెబుతారు
పోలీసులు కూడా ఎక్కడో ఒక సొసైటీను, చారిటబుల్ ట్రస్ట్ లో భాగస్వాములుగా ఉండి వారి దగ్గరకు
రావలసిన సొమ్మును ట్రస్ట్ కు పంపిస్తుంటారు ఆ ట్రస్టు వారు వ్యాపారం చేసి పోలీసు వారు రిటైర్డ్
అయ్యే సమయానికి వారికి సమకూరుస్తుంటారు ఇలాగే తాసిల్దార్లు కూడా జిల్లా అధికారులు కూడా
ఐ ఎ స్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ దారిలోనే నడుస్తారు. ప్రజల సొమ్ము ఎలా దోచెయ్యాలి
అనేది మాత్రమే వీరు ఆలోచిస్తారు రాజకీయ నాయకులకు అండగా ఉండి
ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి జై కొడుతూ వారి పదవులను
కాపాడుకుంటూ ముందుకు సాగి పోతుంటారు, జిల్లా అధికారి స్థాయి వరకు ఇదే వ్యవస్థ
ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశపడి
ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ఉన్న ఇంతసేపు నాయకుల బెదిరింపులు వారు చెప్పిన మాటలు
వినకపోతే బదిలీలు మెమోలు ఇవన్నీ వస్తాయని వారు చెప్పిన మాట వింటారు ఇలా రాజకీయంతోనే
ప్రభుత్వం యంత్రాంగం నడుస్తుంది అందరు ఉద్యోగులకు వారి వారి వాట్సాప్ గ్రూపులో యూనిటీగా
ఉండి పనులు నడిపిస్తారు. ప్రజలు ప్రతి సంవత్సరం పన్ను చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
ఇస్తే అదే ప్రజలను రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ప్రజల నెత్తి మీద శఠగోపురం
పెడతారు ,ఇది ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు దొరికితే దొంగ దొరక్కపోతే దొర నిజాయితీ గల అధికారులు
వేళ్ళ మీదే లెక్కిస్తాం. నిజాయితీ లేని అధికారులు కోకొలను ఒకరిని తుంచితే మరొకరు వస్తారు ఇప్పుడు
జరుగుతున్న నాగేశ్వరరావు కేసులో ఎంక్వైరీలు పూర్తయిన తర్వాత నాగేశ్వరావుకు శిక్ష పడుతుందా
పడదు ఈ ఎంక్వైరీలో పోలీసులే ఉంటారు కాబట్టి.




