జాతీయ వార్తలు
15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అపూర్వ విజయం..

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్
నెంబర్ ఓట్లను ఆమె ఇప్పటికే సాధించారు. మూడో రౌండ్ ముగిసేసరికి ఆమెకు 2161 ఓట్లు వచ్చాయి. వీటి
విలువ 5, 77, 777. మరోవైపు విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు మూడో రౌండ్ ముగిసేసరికి ఆయనకు
1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61, 062. ఈ విషయాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ మీడియాకు వెల్లడించారు.




