
యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే ల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బెల్జియంలో ప్రారంభమై షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమా ఫ్లైట్ లో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాకి జత చేస్తూ, స్పష్టం చేసారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా లెక్కచేయకుండా ప్రభాస్ యూనిట్ మొత్తం బెల్జియంలో పది డిగ్రీల వాతావరణంలో షూటింగ్ పూర్తి చేసినట్టు వివరించారు రాధాకృష్ణ.
కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నవిషయం విదితమే.




