
ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ)లు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 17 వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది.
లఢఖ్లో 17 వేల అడుగుల ఎత్తులో భారత జవాన్లు తెల్లని దుస్తులు ధరించి జాతీయ జెండాను ఎగురవేశారు. మంచు కొండల్లో మైనస్ 20 డిగ్రీల చలిలో భారత జవాన్లు జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం భారత జవాన్లు భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.



