Allవార్తలు

నిర్భయ దోషులకు ఒకేసారి ఉరిశిక్ష


తీహార్ జైల్లో ఉన్న నిర్భయ హత్యాచార కేసు నలుగురు నిందితుల్ని ఒకేసారి ఉరి తీస్తారని తెలుస్తోంది. ఉరి కంబానికి నలుగురు దోషులను ఒకేసారి వేలాడదీసి ఉరిశిక్షను అమలు చేయడం కోసం నూతన టెక్నిక్‌లను అనుసరిస్తున్నట్టు సమాచారం. ఒకేసారి నలుగురి బరువు మోయగలిగే సామర్థ్యం ఉరి కంబానికి ఉందా? అనే విషయాన్ని నిర్ధారించడం కోసం జైలు అధికారులు నూతన టెక్నిక్‌లను ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్ వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ థాకూర్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరిస్తే.. తిరస్కరణకు గురైన 14 రోజుల తర్వాత వీరికి మరణ శిక్ష విధిస్తారు. దోషులు నలుగుర్ని ఒకేసారి ఉరి తీయడం తప్పనిసరి అని తెలుస్తోంది. నలుగురి బరువును మూడు గంటలపాటు ఉరి కంబాలు మోయగలవా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం తీహార్ జైల్లో ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. ఉరి కంబాలను పటిష్టంగా ఉండేలా చూడటం కోసం జైలు అధికారుల బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. తీహార్ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని 1950ల్లో నిర్మించారు. రెండు స్తంభాలను కలుపుతూ మెటల్ బార్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరి తాడును కడతారు. ఉరి తాళ్ల వల్ల దోషుల మెడ కోసుకుపోకుండా, గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని జైలు అధికారులు తెలిపారు. ‘ఉరి తాడు ఉచ్చు ముందు భాగంలో తాడుకు వెన్న రాస్తారు. దీని వల్ల తాడు మెడ చుట్టూ బిగుసుకుపోయి.. తక్కువ నొప్పితో వ్యక్తి మరణిస్తాడ’ని జైలు అధికారులు తెలిపారు. జైల్ నంబర్ 3లో నలుగురు దోషుల్ని వేర్వేరు సెల్‌లలో ఉంచారు. కేసు పురోగతిని తెలుసుకోవడం కోసం వీరంతా తరచుగా లాయర్లతో భేటీ అవుతున్నారు. ఉరి తీసే సమయం దగ్గర పడుతుండటంతో.. దోషుల్లో ఆందోళన కనిపిస్తోందని అధికారి ఒకరు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker