ఎంతమందిని మోసం చేస్తారు…. చట్టం వీరికి పని చేయదా

343 సర్వే నెంబర్ కి 43 రైతులు…..
సాహితి ఇన్ఫ్రా కి ఒక ఎకరా మాత్రమే
ఎంతమందిని మోసం చేస్తారు…. చట్టం వీరికి పని చేయదా.
:సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ వారు చెబుతున్న దాంట్లో ఎంత నిజముంది, బాధితులను
మెప్పించడానికి తప్ప వారి దగ్గర సరైన సమాధానం లేదు, ఎందుకంటే వారికి లాండే లేదు.
ఒక్క ఎకరా ఉన్నట్టు రెవెన్యూ ధరణి రికార్డుల్లో పొందుపరిచి ఉంది. 343 సర్వే నెంబర్లు ఉన్న
మొత్తం లబ్ధిదారుల వివరాలు చూస్తే, జీరిపేటి యాదగిరి రెండు ఎకరాలు, వి వెంకట్రావు
మూడెకరాలు, కాసిం నాలుగు ఎకరాలు, అబ్దుల్లా 10 గుంటలు, వజెండ్ల బసవపూర్ణారావు రెండెకరాల
30 కుంటలు. సిర్పూర్ అభిలాష్ 10 గుంటలు, సాహితీ ఇన్ఫ్రా ఒక ఎకరా ,ట్విట్ లైట్లైప్రాపర్టీస్ 1 ఎకరా,
ఓ మిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ రెండెకరాలు, ఎన్ అనంతరావు ఒక ఎకరా ఎనిమిది గంటలు,
పీల సునీత 32 కుంటలు, ఎల్ లోకేశ్వరరావు 5 ఎకరాలు, నబియా అలీ మూడు ఎకరాల ఏడు గుంటలు,
సయ్యద్ నూర్ అహ్మద్ మూడెకరాల 8 గుంటలు, అంజు మబిన్ మూడెకరాల ఏడు గంటలు, ఐజి స్పెషల్
టాస్క్ ఫోర్స్ 70 ఎకరాలు, ముడుపు రవీందర్ రెడ్డి 3 ఎకరాలు, ముడుపు రోహిత్ రెడ్డి ఒక ఎకరా, హరేంద్ర రెడ్డి
ముడుపు ఒక ఎకరా, ఎం వెంకటమ్మ నాలుగెకరాల 35 గుంటలు, ఎం భాస్కర్ రెడ్డి నాలుగెకరాల 34 గుంటలు,
ప్రభుత్వ భూమి 109 ఎకరాల మూడు గుంటలు, సమీర్ అహ్మద్ 15 గుంటలు, సయ్యద్ నజీర్ మూడు గుంటలు,
సయ్యద్ నజీర్ 15 గుంటలు, సయ్యద్ రసీదు హైదర్ 15 గుంటలు, సయ్యద్ నజీర్ 2 గుంటలు, నరేష్ నకేషన్
14 గుంటలు, శేషనారాయణ ఒక ఎకరా 13 గుంటలు, మహి పార్టీలక్ష్మణ్ ,ఒక ఎకరా 14 గుంటలు,
బసవేశ్వర్ దయాల్ గుప్తా ఒక ఎకరా 13 గుంటలు, రేఖ 1.13గుంటలు సుశీల్ ఒక ఎకరం పద్మజ సత్యనారాయణ 2. 10 జైపాల్ రెండెకరాల 9గుంటలు జై రాములు రెండు ఎకరాల 9 గుంటలు,
జె కృష్ణ రెండు ఎకరాల 10 గుంటలు, జె యాదగిరి రెండెకరాల 10 గుంటలు ప్రభుత్వ భూమి నాలుగెకరాల 35 గుంటలు,
ఈ విధంగా భూమి దాదాపు 43 మంది రైతుల పేరిట ప్రభుత్వం పేరిట ధరణిలో రాయబడింది మరి సాహితీ
కు ఉన్నది ఒకే ఎకరా భూమి మరి ఈ భూమితో 30 ఎకరాల భూమి కొని 1500 మంది బుకింగ్ దారులకు ఏం సమాధానం చెబుతారు




