తెలుగు రాష్ట్రాల్లో మోసాల్లో వారిదే పై చేయి

సాహితి ఇన్ఫ్రా చేస్తోంది పచ్చి దగా….
తెలుగు రాష్ట్రాల్లో మోసాల్లో వారిదే పై చేయి
2015 నుండి 2022 వరకు అన్ని ప్రాజెక్టులు జీరో
సాహితీ ఇన్ఫ్రా పై పోలీసులు కేసులు నమోదు చేయరా…….
మోసాలకు పెట్టింది పేరుగా సాహితీ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో ఫ్రీ లాంచ్ మోసాలతో
ప్రజలను తప్పుదోవ పట్టించి వారి సొమ్మును దోచుకుని కనపడకుండా తిరగడమే
ఆయన ప్రత్యేకత, ప్రస్తుతం తెలంగాణలోని అమీన్పూర్లో వెంచర్లేస్తున్నానంటూ 1500
కోట్లు స్వాహా చేశాడు? గతంలో కాకతీయ హిల్స్, అయ్యప్ప సోసైటీ, బుట్ట బేగంపేట ఇవి
తెలంగాణలోని సాహితీ వలలో పడి మోసపోయిన వారి అడ్రస్సులు. ఆంధ్రప్రదేశ్లో
రాజధానికి దగ్గరలో కాజా అనే ఊర్లో విల్లలు కట్టిస్తున్నాను అంటూ రెండు
సంవత్సరాల టైం అయిపోయేసరికి చేతులెత్తేసి కనపడకుండా పోయారు?
చనిపోయిన వ్యక్తుల పేరుమీద సేల్ డీడీ లు చేయించడం ఎవరైనా ఎదురు
తిరిగితే వారిని పోలీసులతో బెదిరించడం ఇది లక్ష్మీనారాయణ పని. అవార్డులు
పొందే అర్హత ఉన్న వ్యక్తిగా నటిస్తూ రెండు అవార్డులనుప్రజల సొమ్ముతో కొనుక్కొని ఆయన
మంచి వాడిలా చూపించుకున్నాడు అవార్డు తీసుకునే అంత గొప్ప మనస్తత్వం కలిగిన
వ్యక్తిగా ఉన్న లక్ష్మీనారాయణ మరి అదే ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి సమీపంలో కాజా అనే ఊర్లో విల్లాలు నిర్మాణం
చేసి ఇస్తామని ఒక్కొక్కరు దగ్గర నుండి 25 లక్షల నుండి 98 లక్షల వరకు తీసుకున్నట్టు అక్కడ
ప్రజలు తెలుపుతున్నారు. ప్రదేశానికి ఒక పేరు ఒక ఆఫీసు నిర్మాణం చేసి ప్రజలను ఆకట్టుకునే
విధంగా చూసుకుని వ్యాపారాలు చేస్తారు.లక్ష్మీనారా పై పోలీసులు, రాజకీయ నాయకులు,
ఎందుకు అతని శిక్షించాలి అనే నిర్ణయాలు ఎందుకు చేయలేకపోతున్నారు అని బాధితులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పడం ఎంత తెలివిగల వాళ్ళ లక్షణం,
మూడు సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇల్లు కట్టడం లేదు డబ్బులు తిరిగి చేస్తాను,
నాకు టైం కావాలి మీరేం భయపడొద్దు అంటూ వీడియోలు పంపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో
పోలీసులు ఏమి చేయట్లేదు పొలిటికల్ లీడర్లు ఏమి చేయటం లేదు ఎందువల్ల వారికి డబ్బులు
ఇచ్చి వారిని కొనేశారా అని బాధితులలో అనుమానం తలెత్తుతుంది



