
2020 బడ్జెట్లో కేంద్రం రైతులకు మంచి వార్త చెప్పింది నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2020-21 బడ్జెట్ లో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత, గ్రామీణాభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయని ఆమె చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫసల్ బీమా పథకంతో దేశవ్యాప్తంగా 6.11 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల సహకారంతో బీమాను అమలు చేయనున్నట్లు తెలిపారు.




